ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|

0
216

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్ తరలిస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబై నుంచి నగరానికి భారీగా మాదకద్రవ్యాలు రవాణా జరుగుతున్నాయన్న గోప్య సమాచారం అందడంతో డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ బృందం అప్రమత్తమైంది. పారడైజ్ పరిసరాల్లోని సన్‌షైన్ హాస్పిటల్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఆటోలో వచ్చిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాలు వద్ద ఐదు ప్యాకెట్లలో దాచిన 7.5 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.2.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముంబైలో గ్రాముకు రూ.15,000కి కొనుగోలు చేసిన కొకైన్‌ను హైదరాబాద్‌లో గ్రాముకు రూ.30,000కి విక్రయించేందుకు నిందితురాలు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ రాకెట్ వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అరెస్ట్ చేసిన నిందితురాలిని తదుపరి విచారణ కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రగ్స్ పట్టుకున్న డిటిఎఫ్ బృందాన్ని హైదరాబాద్ డీసీపీ అనిల్ కుమార్ రెడ్డి, ఏఎస్ శ్రీనివాసరావు అభినందించారు.

నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కడుపులో గడ్డను బిడ్డ అని తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేసిన ప్రభుత్వ డాక్టర్లు
*గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను ... బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు...
By Rajini Kumari 2026-03-12 13:32:39 0 130
Bharat Aawaz
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day The power to build a society and the wisdom to guide the future lie with...
By Bharat Aawaz 2025-09-05 07:16:51 0 851
Andhra Pradesh
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
By Pagadala Venkateswar 2026-05-22 12:45:54 0 42
Andhra Pradesh
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...
By Pagadala Venkateswar 2026-04-13 05:43:50 0 91
Andhra Pradesh
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం"...
By Pagadala Venkateswar 2026-03-25 02:56:20 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com