ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|

0
95

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్ తరలిస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబై నుంచి నగరానికి భారీగా మాదకద్రవ్యాలు రవాణా జరుగుతున్నాయన్న గోప్య సమాచారం అందడంతో డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ బృందం అప్రమత్తమైంది. పారడైజ్ పరిసరాల్లోని సన్‌షైన్ హాస్పిటల్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఆటోలో వచ్చిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాలు వద్ద ఐదు ప్యాకెట్లలో దాచిన 7.5 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.2.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముంబైలో గ్రాముకు రూ.15,000కి కొనుగోలు చేసిన కొకైన్‌ను హైదరాబాద్‌లో గ్రాముకు రూ.30,000కి విక్రయించేందుకు నిందితురాలు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ రాకెట్ వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అరెస్ట్ చేసిన నిందితురాలిని తదుపరి విచారణ కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రగ్స్ పట్టుకున్న డిటిఎఫ్ బృందాన్ని హైదరాబాద్ డీసీపీ అనిల్ కుమార్ రెడ్డి, ఏఎస్ శ్రీనివాసరావు అభినందించారు.

నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా...
By Vadla Egonda 2025-06-02 12:00:17 0 2K
Andhra Pradesh
ఎస్పీ గ్రీవెన్సు 4 అర్జీలు
పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 4...
By Boiena Rajesh 2026-03-09 14:32:59 0 142
Andhra Pradesh
కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల...
By Pagadala Venkateswar 2026-03-28 14:38:18 0 79
Andhra Pradesh
కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం
అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది...
By SivaNagendra Annapareddy 2025-12-13 05:31:30 0 264
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 49
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com