కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు.
నగరంలోని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కల్తీ, నాసిరకం పదార్థాల వినియోగం పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.
ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరా ప్రక్రియలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, లాభాల కోసం నాణ్యతను తగ్గించడం సహించబోమని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు. నగరంలో ఫుడ్ ఇన్స్పెక్షన్లను మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశం ద్వారా ఫుడ్ వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని పోలీసులు సూచించారు.
#sidhumaroju
Alwal
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy