Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.

0
52

సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ తల్లి కోరగా, అతనికి ఆటో కొనివ్వమని సీఎం చెప్పారంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

 

ఇటీవల తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన ముక్కర అంబిక ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడ వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకునే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్తకు జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

 

సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎదురింటికి చెందిన మరో మహిళ తన డిగ్రీ చదివిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కొందరు దురుద్దేశంతో అంతకుముందు సీఎం అంబిక భర్తకు ఆటో ఇప్పించాలని ఇచ్చిన ఆదేశాలను, ఈ మహిళ చేసిన అభ్యర్థనకు జతచేసి "చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తారట" అంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 

ఈ వ్యవహారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగంతో పాటు మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. రెండు వేర్వేరు వీడియో క్లిప్పులను కలిపి "కట్ అండ్ పేస్ట్" చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో లోపాలు వెతకలేకే, వైసీపీ ఇలాంటి తప్పుడు వీడియోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని, ప్రజలకు వాస్తవాలు తెలుసని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 144
Odisha
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
By Bharat Aawaz 2025-06-27 07:58:21 0 2K
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 100
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com