అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు

0
76

విజయవాడ

01-04-2026

 

 ప్రచురణార్థం 

 

*బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు*

 

*..........భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ*

 

అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ను పురస్కరించుకొని శ్రీ ఈశ్వర పుత్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట లో సాయిబాబా ప్రశాంత నిలయం లో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఈశ్వర పుత్ర భక్త బృందం గురుస్వామి కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి మరియు బాబా ప్రశాంత నిలయం నిర్వాహకులు భోగవల్లి పృథ్వి సాయి కుమార్ పూజ కైంకర్యాలు నిర్వహించగా అయ్యప్ప భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో కనులవిందుగా అభిషేక కార్యక్రమం కొనసాగింది.అనంతరం అష్టోత్తరపూజలునిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణి చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హరీష్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సాయిబాబా ప్రశాంత నిలయంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ చేయడం జరిగిందన్నారు.

 

ఈ కార్యక్రమంలో సత్తిరాజు,శ్రీనివాసన్,నాగోతి సాయి కుమార్,సాయి హర్ష,బబ్లు,పవన్ శ్రీ కళ్యాన్,జగదీష్,మరియు ఈశ్వర పుత్ర భక్త బృందం సభ్యులు,సాయిబాబా ప్రశాంత నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక...
By Ratna Sekhar 2026-03-11 07:11:17 0 111
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 227
Tamilnadu
Call for Anti-Torture Law Grows Stronger in Tamil Nadu
Tamil Nadu, July 2025: After the tragic custodial death of a security guard in Sivaganga, public...
By Citizen Rights Council 2025-07-29 05:17:40 0 1K
Andhra Pradesh
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-17 10:44:44 0 106
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని...
By Benguluri Madhubabu 2026-02-27 03:44:46 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com