మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్

0
143

 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ... బిజెపి జిల్లా అద్యక్షులు శ్రీ అక్కమతోట రామకృష్ణ  మరియు బీజేపీ పార్టీ జిల్లా అదికార ప్రతినిథి శ్రీ గురురాజ్ దేశాయ్ గారు.  ఈ సందర్బంగా బిజెపి జిల్లా అద్యక్షులు రామకృష్ణ గారు మంత్రితో మట్లాడుచూ జిల్లలో ఎక్కడా కూడా కూటమి థర్మాన్ని పాటించడం లేదని ఇకపొతే ఎమ్మిగనూరు తాలూకాలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందా లేక టిడిపి మత్రమే అదికారంలో ఉన్నదా అన్న సంశయం కూడా అక్కడి ప్రజలలో కలుగుతోందని జిల్ల ఇంచార్జి మంత్రితో ఆవేదనగా మాట్లాడారు.జిల్లా కేంద్రమైనటువంటి కర్నూలు టౌన్ లొని స్టేట్ గెస్ట్ హౌస్ లో మంగళవారం కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజి భరత్ జిల్లాకు సంబందించిన మూఁడు పార్టీల కూటమి అద్యక్షులు, ఎమ్మెల్యేలు మరియు మూడుపార్టీల అసెంబ్లి ఇంఛార్జులతో సమవేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లి తరపున దేశాయ్ నెట్వర్క్ అదినేత మరియు జిల్లా అదికార ప్రతినిథి గురురాజ్ దేశాయ్ గారు హాజరైయ్యారు. కూటమి ప్రభుత్వంలో అధికారులు నిర్లక్ష్యం వలన ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అర్హులైన బిజెపి కార్యకర్తలకు పథకాలు అందడం లేదు అని, ఈ విషయం లో అర్హులైన బిజెపి కార్యకర్తలకు తక్షణమే పథకాలు అందే విధంగా అధికారులను ఆదేశించాలని గురురాజ్ దేశాయ్ ఇంచార్జి మంత్రిని కోరారు. అందుకు జిల్లా ఇంచార్జి మంత్రి గారు సానుకూలంగా స్పందింస్తూ ఈ విషయం మీద విచారణచేసి తక్షణమే ఉన్నతాధికారులకు సూచనలు చేస్తానని తెలియచేశారు.ఈ సమావేశంలో ఇంచార్జి,మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సమావేశం యెక్క ముఖ్యఉద్దేశ్యం కూటమిలో భాగంగా జిల్లాలో బిజెపి, టిడిపి మరియు జనసేన పార్టిలు సమన్వయంతొ పనిచేస్తూ, కూటమిధర్మాలను పాటిస్తూ, కూటమి నాయకులకు మరియు కార్యకర్తలందరికీ సమన్యాయంచేస్తూ ముందుకెళ్లాలని వివరించారు. జిల్లాలోని కూటమి MLA లు ఈ విషయంలో ఎక్కడ కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలియచేశారు.

ఈ సమావేశానికి కూటమి ప్రభుత్వంలో బాగస్తులైన మూడుపార్టీల జిల్లా అద్యక్షులు, శాసనసభ్యులు, నియొజకవర్గ ఇంచార్జిలు మరియు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 759
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com