Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.

0
49

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌లపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన ఈ కేసు అధికారికంగా మూసివేసినట్లు అయింది.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేసింది.

 

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారణకు వచ్చింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ, 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) కింద కేసును మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సీఐడీ నివేదికను వ్యతిరేకిస్తూ, తన వాదనలు వినాలని కోరుతూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆళ్ల పిటిషన్‌లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అనంతరం సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ కేసును మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుతో పాటు ఇతరులకు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించినట్లయింది.

Search
Categories
Read More
Odisha
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
By Bharat Aawaz 2025-07-17 08:30:18 0 1K
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 232
Telangana
వైశ్య యూనిటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి రంగనాదుల కళ్యాణం
By Thodupunuri Visweswarrao 2026-01-14 12:43:21 0 288
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంపెద్ద దోర్నాల. అక్రమ అరెస్టులను ఖండించండి.అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *- సిఐటియు డిమాండ్...*
మార్కాపురం జిల్లా దోర్నాల మండల                 ...
By Chennaiah Kati 2026-03-03 13:03:48 0 139
Andhra Pradesh
చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
28.12.2025. అనంతపురం.   చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం అందుకే ఫ్లెక్సీలపై ఇప్పుడు...
By Rajini Kumari 2025-12-28 09:28:20 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com