Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.

0
144

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌లపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన ఈ కేసు అధికారికంగా మూసివేసినట్లు అయింది.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేసింది.

 

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారణకు వచ్చింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ, 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) కింద కేసును మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సీఐడీ నివేదికను వ్యతిరేకిస్తూ, తన వాదనలు వినాలని కోరుతూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆళ్ల పిటిషన్‌లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అనంతరం సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ కేసును మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుతో పాటు ఇతరులకు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించినట్లయింది.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు నేడు: హరిత ఆంధ్రప్రదేశ్ పచ్చదన వీరులు
నేడు AP పోలీసులు “హరిత ఆంధ్రప్రదేశ్” మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ...
By Kalaga Sailaja 2026-07-04 09:26:32 0 42
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 303
Andhra Pradesh
Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...
By Pagadala Venkateswar 2026-03-23 06:06:12 0 164
Tamilnadu
Tamil Nadu Observes National Electricity Safety Week
The Tamil Nadu Electricity Department is currently observing "National Electricity Safety Week...
By Lokeshwari Panthadi 2026-07-01 04:46:13 0 68
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో దారుణం !!
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది...
By Hari Krishna 2025-12-22 08:21:47 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com