మంచిర్యాల 50 డివిజన్లో కొనసాగుతున్న శుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమం

0
167

మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వారుచేపట్టిన మంచిర్యాల శుభ్రత -ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 వ డివిజన్ నందు చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది.

మేయర్  స్పెషల్ డ్రైవ్ లో జరిగే పనులను పరిశీలించి స్థానిక ప్రజల తో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకోవడం జరిగింది.అధికారులు సిబ్బంది స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారం కొరకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక 50 వ డివిజన్ కార్పొరేటర్ పెట్టం స్వరూప లక్ష్మణ్ , కో ఆప్షన్ సభ్యులు బెంజిమెన్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి గారు, ఆత్మ చైర్మెన్ మురళి గారు,50 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గట్టు స్వామి ,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్ ,కాంగ్రెస్ నాయకులు బొడ్డు శంకర్, అశ్వక్,ప్రకాష్,మురళీధర్,sk ఖలీద్ రౌఫ్, శ్రీనివాస్,రాజేష్,డివిజన్ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు టీపీసీసీ కార్యదర్శి, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్ ఖబర్దార్ అంటూ వార్నింగ్?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ...
By Thalakokkula Sadanandam 2026-06-10 08:33:33 0 219
Andhra Pradesh
పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను...
By Kothuru Murali 2026-04-15 07:38:56 0 121
Andhra Pradesh
ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.
ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో...
By Chennaiah Kati 2026-06-18 11:44:16 0 89
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 98
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com