గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి..

0
186

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ అధికారులతో వివిధ పద్దతులలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.*

 ఈ అవగాహన కార్యక్రమాల వలన ప్రజలలో చైతన్యం వచ్చి కొంతమంది వచ్చిన ఫోన్ కాల్స్ పై అనుమానం రాగానే పోలీసు వారిని సంప్రధించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది.

 ముఖ్యంగా ,సీనియర్ సిటిజెన్ కు WhatsApp కాల్స్ చేసి మీమీద మనీ లాండరింగ్ కేసు ఉంది అంటూ స్టేట్ మెంట్ రికార్డు చేసి తప్పించాలంటే డబ్బులు డిపాజిట్ చేయమని బెదిరిoపు ఫోన్ కాల్స్ వచ్చి నప్పుడు వెంటనే సైబర్ పోలీసు వారిని సంప్రదించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడవలసినదిగా తెలపడం అయినది, 

సీనియర్ సిటిజెన్ కు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు WhatsApp కాల్స్ చేసి సిబిఐ నుండి నుండి పోలీసు అని చెప్పి మీ ఫోన్ ద్వారా అశ్లీల ఫోటోలు పంపినట్లు కేసు నమోదైంది, దానిని నుండి మీ పేరు తొలగించాలంటే డబ్బులు డిపాజిట్ చేయమని బెదిరింపు కాల్స్ వస్తే, వెంటనే సైబర్ పోలీసు వారిని సంప్రదించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడవలసినదిగా తెల్పడమైనది.

సైబర్ మోసగాళ్లు, పోలీస్ / కోర్టు / కస్టమ్స్ / టెలికాం అధికారులమని చెప్పుకొని WhatsApp కాల్స్ చేస్తారు. నకిలీ FIRలు చూపించి “డిజిటల్ అరెస్ట్” అంటూ భయపెడతారు. మీ ఆదార్, సిమ్ కార్డు పేరుతో మనీ లాండరింగ్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులని చెబుతారు. అరెస్ట్ తప్పించాలంటే వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని ఒత్తిడి చేస్తారు

పోలీసులు ఎప్పటికీ ఫోన్ లేదా WhatsApp ద్వారా డబ్బులు అడగరు, ఎలాంటి లింక్‌లను ఓపెన్ చేయవద్దు – డబ్బులు పంపవద్దు. అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే కట్ చేయండి. సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి లేదా 1930 కు కాల్ చేయండి. మరియు మీ ఫోన్లో వచ్చే ఎలాంటి APK ఫైల్స్ ఓపెన్ చేయకండి.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140...
By Pagadala Venkateswar 2026-02-03 13:08:51 0 105
Andhra Pradesh
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం. హోలీ, రంజాన్ పండుగలు కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:17:55 0 207
Andhra Pradesh
పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను...
By Kothuru Murali 2026-04-15 07:38:56 0 83
Andhra Pradesh
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-03-21 11:26:31 0 138
Andhra Pradesh
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి పెద్ద దోర్నాల మండలం చిన్న...
By Chennaiah Kati 2026-03-07 12:17:44 0 367
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com