ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష

0
110

_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని డాక్టర్ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కూడలి వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఆప్కోలో విలీనం అనే నిర్ణయం చేనేతల అస్తిత్వంపై నేరుగా దాడి చేసినట్లేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆప్కోలో లాభదాయకంగా, స్థిరంగా నడుస్తున్న ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను విలీనం చేయడం వెనుక తీవ్రమైన దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఈ చర్య వల్ల చేనేతల స్వావలంబన పూర్తిగా దెబ్బతిని, మళ్లీ మధ్యవర్తుల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు...
By Boiena Rajesh 2026-03-06 02:13:55 0 126
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2025-12-18 08:21:14 0 151
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్.
    Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్ 13-02-2026...
By Pagadala Venkateswar 2026-02-13 11:34:14 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com