ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష

0
168

_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని డాక్టర్ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కూడలి వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఆప్కోలో విలీనం అనే నిర్ణయం చేనేతల అస్తిత్వంపై నేరుగా దాడి చేసినట్లేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆప్కోలో లాభదాయకంగా, స్థిరంగా నడుస్తున్న ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను విలీనం చేయడం వెనుక తీవ్రమైన దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఈ చర్య వల్ల చేనేతల స్వావలంబన పూర్తిగా దెబ్బతిని, మళ్లీ మధ్యవర్తుల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్...
By Benguluri Madhubabu 2026-03-15 12:18:31 0 181
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 124
Andhra Pradesh
పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును...
By Benguluri Madhubabu 2026-04-09 07:33:01 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com