ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

0
174

ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

 

వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 

ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ. 26, లీటర్ డీజిల్‌పై రూ. 81.90 చొప్పున నష్టపోతున్నాయి. ఈ కంపెనీలు రోజుకు మొత్తంగా రూ. 2,400 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. తాజాగా తగ్గించిన రూ.10 ఎక్సైజ్ సుంకం ఈ నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేస్తుందని, దీనివల్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవచ్చని పేర్కొంది.

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజుల్లోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు (దాదాపు 75 శాతం పెరుగుదల) పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగినా, భారత్‌లో మాత్రం ధరలను స్థిరంగా ఉంచామని పేర్కొంది. సామాన్య పౌరులను కాపాడేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

ఇదే సమయంలో, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం కొత్తగా సుంకాన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో, ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రపంచ ఇంధన పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, వినియోగదారులకు సరఫరా, ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు : అంతర్గత అసంతృప్తి.|?
హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. గత...
By Sidhu Maroju 2026-03-16 09:01:17 0 160
Andhra Pradesh
ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి...
By Pagadala Venkateswar 2026-03-17 03:17:18 0 168
Haryana
Haryana Cities Review Strategy for Monsoon Readiness
With the monsoon rapidly advancing across northern India, district administrations in Gurugram,...
By Lokeshwari Panthadi 2026-06-27 05:33:27 0 38
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 451
SURAKSHA
WB Police Empowering Women Through Saurabh Teams
 To ensure the safety of women and students, the West Bengal Police has deployed the...
By Kalaga Sailaja 2026-06-27 07:22:31 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com