కొండెక్కిన కోడి దిగింది కేజీ 270

0
169

*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు* ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి. *ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు.. కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు..* చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు తెలిపారు..!!

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: యోగా శిభిరామ్ లో పలుగోనా ఎమ్మెల్యే
భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-01 07:25:34 0 150
Telangana
నిజామాబాద్:జనాభా లెక్కల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపు  2027 జనాభా లెక్కలకు సంబంధించి...
By Sadaq Sadaq 2026-05-26 19:15:09 0 91
Telangana
పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు లో ఫైల్ ?
సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరును పోక్సో కేసు విషయంలో వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసు...
By Ponnala Srinivasrao 2026-05-16 02:41:26 0 117
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 162
Telangana
మంచిర్యాల్: బిఆర్ఎస్ లో విద్యార్థి నేత చేరిక
మంచిర్యాల్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమీక్షంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు...
By Bonagiri RaviShankar 2026-05-30 11:44:16 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com