కొండెక్కిన కోడి దిగింది కేజీ 270

0
85

*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు* ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి. *ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు.. కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు..* చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు తెలిపారు..!!

Search
Categories
Read More
Andhra Pradesh
సైబర్ నేరాలు, రహదారి భద్రత, హెల్మెట్ వాడకం , మహిళలపై జరిగే నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు : కర్నూలు పోలీసులు
కర్నూలు :  కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, మహిళల పై జరిగే...
By Hari Krishna 2026-01-08 11:28:57 0 145
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
Andhra Pradesh
చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర...
By Pagadala Venkateswar 2026-02-19 10:04:00 0 85
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com