కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ

0
203

కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ 

 

సూర్యమోహన్ 

 

మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ

 

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

 

భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:

 

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా టీడీపీ జెండా ఎగురవేసినారు.ఈ వేడుకను టీడీపీ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బుడ్డోల్ల శ్రీనివాస్ ,కార్యకర్తలు కలిసి జెండాను ఆవిష్కరించిన తర్వాత బుడ్డోల్ల శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పారు టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కేవలం పేద ప్రజలకోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు అని నేడు తెలంగాణలో కూడ పేద ప్రజలకు న్యాయం జరుగలి అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండే 

​ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ బుడ్డోల్ల మల్లేశ్వరి, మద్దూర్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుడ్డొల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జోగు హనుమంతు, మాజీ వార్డ్ మెంబర్ వంచర్ల కిష్టప్ప పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు వెంకటయ్య, బీములు, నర్సప్ప, హనుమంతు, నర్సింలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ - జై తెలుగుదేశం - జై ఎన్టీఆర్" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మద్దూరు పురవీధుల్లో మారుమోగాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 185
Andhra Pradesh
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results Link Below !!!!
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:15:44 0 167
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
By Pagadala Venkateswar 2026-02-06 05:06:19 0 127
Andhra Pradesh
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
By Pagadala Venkateswar 2026-02-27 09:10:34 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com