ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రికోట రాజీవ్ రెడ్డి గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనీ రెడ్డి గారు కలవడం జరిగింది.

0
209

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనిరెడ్డి 

ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతున్న తీరు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణిస్తున్న పరిస్థితులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, హాస్టల్ సదుపాయాల లోపం వంటి సమస్యలపై *మనిరెడ్డి గారు* మరియు *ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు లోతుగా చర్చించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విద్యార్థుల సమస్యలపై బలమైన ప్రజా పోరాటాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి విద్యార్థుల హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు.

అలాగే నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కాలేజీలలో మౌలిక వసతులు మెరుగుపరచి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను గుర్తు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కాపాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు యువ నాయకులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జాతీయ ఓటరు దినోత్సవ... నా భారత్ నా ఓటు అనే నినాదం... కలెక్టర్ రాహుల్ రాజ్.
 మెదక్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో “నా భారత్ - నా ఓటు” అనే...
By Gangaram Rangagowni 2026-01-23 09:40:58 0 348
Andhra Pradesh
పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
*పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు*    *ప్రజల సంక్షేమమే...
By Rajini Kumari 2026-04-20 15:09:32 0 97
Andhra Pradesh
పుంగనూరు మండలంలో ఘోరం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై...
By Kothuru Murali 2026-04-02 06:07:52 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com