ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
_*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి మహోన్నత వారసత్వాన్ని స్మరించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న ప్రగతిశీల కృషిని నాయకులు కొనియాడారు ఎ మ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు టీడీపీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలందరూ కలిసి టీడీపీ ప్రతిజ్ఞ చేశారు.
నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కార్యకర్తలను (BSBG D2D, సభ్యత్వ నమోదు, STA D2D, పోలీసు కేసులు మరియు MyTDP App కార్యకలాపాల ఆధారంగా ఎంపికైన వారిని) సన్మానించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు వీడియో కాల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, ప్యాక్స్ అధ్యక్షులు, నియోజకవర్గ గ్రామ & వార్డ్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz