బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|

0
88

హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. 

శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. 

మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్  27.12.2025   NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో పత్రికా...
By Rajini Kumari 2025-12-27 10:52:01 0 162
Andhra Pradesh
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-06 13:21:00 0 84
Andhra Pradesh
లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ...
By Hari Krishna 2026-01-07 09:13:14 0 144
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి...
By Hari Krishna 2025-12-15 12:03:37 0 190
Andhra Pradesh
కూట‌మి పాల‌న‌లో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ...
By mahaboob basha 2025-07-19 12:47:15 0 965
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com