బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|

0
134

హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. 

శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. 

మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు
విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల...
By Boiena Rajesh 2026-03-23 04:11:20 0 152
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 142
Telangana
"బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత.. శాంతియుత వేడుకలకు సీపీ సుమతి పిలుపు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్...
By Sidhu Maroju 2026-05-23 13:22:03 0 58
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:48 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com