బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|

0
137

హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. 

శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. 

మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
By Pagadala Venkateswar 2026-05-07 07:06:47 0 60
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 245
Telangana
"POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|
హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల...
By Sidhu Maroju 2026-05-16 16:38:31 0 141
Telangana
మంగాపురం తండాలో నీటి సమస్యకు సర్పంచ్ పరిష్కారం...
పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Krishna Balina 2026-02-23 09:20:25 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com