APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.

0
186

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది. 

 

ప్రభుత్వ నిర్ణయంతో 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన 300 ఏఆర్ఎస్ఐ పోస్టులకు బదులుగా, అంతే సంఖ్యలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కర్నూలు (2వ బెటాలియన్), కాకినాడ (3వ), విజయనగరం (5వ), మంగళగిరి (6వ) బెటాలియన్లలో ఒక్కొక్కదానికి 42 చొప్పున పోస్టులను కేటాయించారు. అలాగే, 9, 11, 14, 16వ బెటాలియన్లకు తలా 33 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. 

 

రాష్ట్ర డీజీపీ 2025 జనవరి 31న పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు 2026 మార్చి 14న రాష్ట్ర కేబినెట్, మార్చి 26న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. తాజాగా హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 264
Andhra Pradesh
కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత...
By Kothuru Murali 2026-04-01 05:57:57 0 167
Chandigarh
Chandigarh Strengthens Traffic and Road Safety Measures
Chandigarh continues to enhance traffic management and road safety through the adoption of...
By Fathima Safa 2026-07-02 06:13:30 0 41
Andhra Pradesh
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
By Pagadala Venkateswar 2026-05-27 06:10:37 0 72
Telangana
వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఎదురుచూపులు మహిళలు రైతులు బయోమెట్రిక్ కోసం.....!
వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు...
By Gujile Ramu 2026-05-09 00:53:29 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com