తన గురువు డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం.

0
118

తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.

‎ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు.

రమణయ్య గారు సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గారు గుర్తు చేసుకున్నారు.

‎వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

‎కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు. 

‎చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది.

సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య గారు పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో...
By Chennaiah Kati 2026-03-09 13:36:49 0 135
Andhra Pradesh
మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు...
By Pagadala Venkateswar 2026-01-15 07:55:35 0 121
Andhra Pradesh
పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆదివారం ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో వాహనాల...
By Kothuru Murali 2026-03-23 04:53:54 0 97
Andhra Pradesh
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
By mahaboob basha 2025-06-14 14:43:16 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com