విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన

0
112

*విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ*

 

*ఆవుదుడ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణ*

 

*జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ*

 

దారు(చెక్క పని) శిల్పకళా కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కత్తురోజు రామకృష్ణ. త్వరలో జరగనున్న విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనను ఆవు దూడ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పొట్లూరు చిరంజీవి ఆచార్య ను కూడా ఆవుదుడా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లి కిల్లా రోడ్డు బొమ్మల కాలనీలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రామకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్క పని చేసే దారుసిల్పులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కొండపల్లిలో తెల్లపునికి చెట్లు లభించకపోవడం, ఆర్థికంగా అవకాశాలు లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అవకాశాలు కల్పించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. పోరాడేందుకు తనకు అందరి సహకారం కావాలని ఏప్రిల్ 12న జరిగే ఎన్నికలలో ఆవుదుడ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 230
Andhra Pradesh
గ్రూప్-2 ఫలితాలలో విజయం సాధించిన మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులు
గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు...
By Chennaiah Kati 2026-02-04 08:30:23 0 164
Andhra Pradesh
తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్  పథకం విస్తరణ జరుగుతోంది
తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్ (పి డబ్ల్యూ ఎస్ ) పథకం విస్తరణ జరుగుతోందని గ్రామీణ...
By John Baji 2025-12-31 01:46:23 0 111
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 192
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com