చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.

0
111

కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు.మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి ఆయన నివాసంలో అంబటి రాంబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న రాంబాబుకు ముద్రగడతోపాటు,ఆయన తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబంపై దాడి దాడి చేయడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపట్ల అమానుషంగా ప్రవర్తించిందన్నారు.దానికి ప్రతిఫలంగా ఐదు సంవత్సరాలు టిడిపి అధికారం కోల్పోయిందని గుర్తుచేశారు.ముద్రగడ లాంటి పట్టుదల గల వ్యక్తి అరుదుగా ఉంటారని, ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్న ఘనత ముద్రగడకే దక్కుతుందన్నారు. ముద్రగడ లాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపు జాతి గర్వపడాలన్నారు.కూటమి ప్రభుత్వం నాపై దాడి చేసి నా ఇంటిని, కారును, ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. నా కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించి నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్నారు.నాపై ఎన్ని కేసులు పెట్టినా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సహకారంతో న్యాయపోరాటం చేస్తూనే ఉంటానన్నారు. చంద్రబాబును లోకేష్ ను వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే హైకోర్టులో రెండు రిట్ ఫిటిషన్ లు వేయడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండతో ముద్రగడ లాంటి నాయకుల ఆశీస్సులతో నా కులం బలంతో దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రాంబాబు అన్నారు.ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు, జక్కంపూడి రాజా,చినబిల్లి వెంకటరాయుడు,తోట రామకృష్ణ,యనమల శ్రీకృష్ణుడు,అధిక సంఖ్యలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
Andhra Pradesh
అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*   *గేట్స్...
By Rajini Kumari 2025-12-16 07:07:54 0 176
Telangana
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా   రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
By Vanmoj Suryamohan 2026-01-10 14:37:48 0 512
Andhra Pradesh
నవులూరు గ్రామంలో స్మశాన వాటికలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు
*నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*   *స్మశాన...
By Rajini Kumari 2026-01-10 13:22:59 0 109
Telangana
బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..
29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను...
By Yadamma Raju Gajapaga 2026-02-12 06:30:40 0 188
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com