చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.

0
412

కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు.మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి ఆయన నివాసంలో అంబటి రాంబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న రాంబాబుకు ముద్రగడతోపాటు,ఆయన తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబంపై దాడి దాడి చేయడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపట్ల అమానుషంగా ప్రవర్తించిందన్నారు.దానికి ప్రతిఫలంగా ఐదు సంవత్సరాలు టిడిపి అధికారం కోల్పోయిందని గుర్తుచేశారు.ముద్రగడ లాంటి పట్టుదల గల వ్యక్తి అరుదుగా ఉంటారని, ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్న ఘనత ముద్రగడకే దక్కుతుందన్నారు. ముద్రగడ లాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపు జాతి గర్వపడాలన్నారు.కూటమి ప్రభుత్వం నాపై దాడి చేసి నా ఇంటిని, కారును, ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. నా కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించి నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్నారు.నాపై ఎన్ని కేసులు పెట్టినా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సహకారంతో న్యాయపోరాటం చేస్తూనే ఉంటానన్నారు. చంద్రబాబును లోకేష్ ను వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే హైకోర్టులో రెండు రిట్ ఫిటిషన్ లు వేయడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండతో ముద్రగడ లాంటి నాయకుల ఆశీస్సులతో నా కులం బలంతో దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రాంబాబు అన్నారు.ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు, జక్కంపూడి రాజా,చినబిల్లి వెంకటరాయుడు,తోట రామకృష్ణ,యనమల శ్రీకృష్ణుడు,అధిక సంఖ్యలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ
చిలుకూరు  మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య,...
By Nookapangu Manikanta 2026-06-20 12:27:34 0 119
Telangana
బ్రేకింగ్ న్యూస్
    రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు   #sidhumaroju  Alwal 
By Sidhu Maroju 2026-03-27 17:04:16 0 150
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 71
Andhra Pradesh
Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!
అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం   తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 07:08:41 0 153
Telangana
రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు...
By Ponnala Srinivasrao 2026-05-06 04:05:40 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com