Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!

0
85

అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం

 

తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశం

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

2026 స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపు

కూటమిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వద్దని సూచన

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైనా తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు.

 

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు, కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు, బెదిరింపులకు లొంగవద్దని హెచ్చరించారు.

 

"వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి" అని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా, విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా, కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

 

ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
By Mobbu Venkatramana 2026-02-04 04:37:32 0 363
Andhra Pradesh
గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్
విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్...
By Mobbu Venkatramana 2026-03-28 15:37:04 0 119
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Telangana
తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్...
By Sidhu Maroju 2025-06-30 17:32:37 0 1K
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com