ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ నాంది పలికిన బోండా ఉమామహేశ్వరరావు

0
116

ప్రచురణార్థం:- 26-03-2026

 

*ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ – ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు*

 

ధి:- 26-03-2026 ఈరోజు గురువారం సాయంత్రం BRTS రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విలేకరుల సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తును మార్చివేసే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపనపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

 

ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఏర్పడనున్న ఈ మహత్తర ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని తెలిపారు.

 

సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడులతో స్థాపించబడుతున్న ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.

 

ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిశ్రమల అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన విజన్, మంత్రి నారా లోకేష్ గారి కృషి , పెట్టుబడిదారులతో సమన్వయం వలననే ఇలాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని...

 

“జాబ్స్ ఫస్ట్ ” విధానంతో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ స్టీల్ ప్లాంట్ ఆ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మరింత అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు.

 

ఈ ప్రాజెక్ట్ వలన ఉత్తరాంధ్రలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతాయని, దీంతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. అలాగే MSMEలు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని అన్నారు.

 

సుమారు 5,465 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ భారీ పరిశ్రమ మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, తరువాతి దశలో 10.5 మిలియన్ టన్నులకు విస్తరించనుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపనున్నదని అన్నారు.

 

ఈ ప్రాజెక్ట్ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, పెట్టుబడులు మరింతగా ఆకర్షితమై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలో ముందంజలో నిలుస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

 

చివరిగా, ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా యువత భవిష్యత్తును మార్చే శక్తివంతమైన అభివృద్ధి యంత్రంగా నిలుస్తుందని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సువర్ణయుగానికి నాంది పలుకుతుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు తెలిపారు.

 

ఈ సమీవేశంలో :- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ సిబ్బంది జనం లోకి !!
కర్నూలు :  విద్యుత్తు వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే ఏపీఎస్పీడీసీఎల్...
By Hari Krishna 2025-12-23 02:04:25 0 161
Telangana
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad:  Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
By Sidhu Maroju 2025-09-11 14:57:27 0 245
Haryana
హర్యానా ఎన్నికలు 2024: EVM లపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు - నిజంగా అవకతవకలు జరిగాయా?
సంచలనం: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.ఆరోపణ: పోలింగ్ తర్వాత కాంగ్రెస్...
By Triveni Yarragadda 2025-08-11 05:44:21 0 1K
Andhra Pradesh
రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు.
చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని...
By Gadiyapudi Narendra 2026-01-19 14:59:07 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com