అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

0
244

_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు – డోర్ టు డోర్ కార్యక్రమం | `అన్నదాత సుఖీభవ` కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.*_

 

- _*మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ సంవత్సరానికి రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన విషయాన్ని గ్రామ ప్రజలకు వివరించి, రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు.*_

 

- _*ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి చిన్నకొత్తిలి గ్రామంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. తాను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.*_

 

- _*అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటి సరఫరా, కొత్త రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, ప్రజా సమస్యలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*_

 

_*ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Telangana
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO...
By Ponnala Srinivasrao 2026-05-16 02:30:12 0 69
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా : భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.భారత...
By Hari Krishna 2026-01-01 04:49:43 0 206
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 134
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర పార్టీ కార్యాలయంలో
గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రివర్యులు పిఎసి...
By mahaboob basha 2025-07-24 14:49:09 0 953
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై...
By Kothuru Murali 2026-02-24 10:26:51 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com