అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

0
322

మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,.

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కృషి చేసి సాధించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రివర్యులు ఇప్పటివరకు ఒక్కసారైనా ఆ యూనివర్సిటీని సందర్శించలేదని ప్రశ్నించారు.

పేరుకే గిరిజన శాఖ మంత్రి ఉన్నా, గిరిజనుల సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోందని తెలిపారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు శాశ్వతమని, చట్టాలు, జీవోలు ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
వైశ్య యూనిటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి రంగనాదుల కళ్యాణం
By Thodupunuri Visweswarrao 2026-01-14 12:43:21 0 526
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 204
Andhra Pradesh
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
By Pagadala Venkateswar 2026-05-14 06:01:31 0 95
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 140
Business & Finance
US Department of Justice Drops All Charges Against Gautam Adani
In a major victory for the Adani Group, the United States Department of Justice has officially...
By Dunna Jessicaruth 2026-05-19 10:29:58 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com