అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

0
111

మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,.

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కృషి చేసి సాధించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రివర్యులు ఇప్పటివరకు ఒక్కసారైనా ఆ యూనివర్సిటీని సందర్శించలేదని ప్రశ్నించారు.

పేరుకే గిరిజన శాఖ మంత్రి ఉన్నా, గిరిజనుల సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోందని తెలిపారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు శాశ్వతమని, చట్టాలు, జీవోలు ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ తనిఖీ
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను  బుదవారం మధ్యాహ్నం...
By Mobbu Venkatramana 2026-03-04 08:34:38 0 220
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 194
Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!
రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ...
By Pagadala Venkateswar 2026-02-23 10:09:44 0 114
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com