Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.

0
245

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.

 

వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు రెండు భారీ కచ్చిడి చేపలు చిక్కాయి. వాటిని వెంటనే అంతర్వేది హార్బర్‌కు తరలించి వేలం వేశారు. ఇందులో 35 కిలోల బరువున్న ఒక చేప రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల ధర పలికింది. అలాగే, 30 కిలోల బరువున్న మరో చేపను వ్యాపారులు రూ.74 వేలకు కొనుగోలు చేశారు. ఈ రెండు చేపలు ఆడవి కావడంతో ఈ ధర వచ్చిందని, అదే మగ చేపలు దొరికితే ఒక్కోటి రూ.4 లక్షల వరకు పలికేదని మత్స్యకారులు తెలిపారు.

 

కచ్చిడికి ఎందుకంత ధర..?

'ప్రొటోనిబియా డయాకాంథస్' అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను 'గోల్డెన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి దాని ఔషధ గుణాలే ప్రధాన కారణం. ఈ చేప పొట్టలోని గాల్ బ్లాడర్ (స్థానికంగా 'పొట్ట' అంటారు) నుంచి శస్త్రచికిత్సల అనంతరం గాయాలకు వేసే కుట్ల దారాన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. దీంతో పాటు కొన్ని రకాల మందులు, వైన్ల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారు.

 

ఈ చేపలు హిందూ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల్లో నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. మే నుంచి అక్టోబర్ మధ్య గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. ఇక్కడి వ్యాపారులు ఈ చేపలను కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతోనే వ్యాపారులు ఎంత ధర వెచ్చించైనా కొనేందుకు ఆసక్తి చూపుతారు.

Search
Categories
Read More
Telangana
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,
మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో...
By Bheeshman King 2026-04-29 12:23:34 0 1K
Andhra Pradesh
ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో...
By Shyamala Yadagiri 2026-07-18 10:26:11 0 41
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 262
Puducherry
Push for Full Statehood Intensifies
Chief Minister N. Rangasamy expressed strong confidence that Puducherry will successfully...
By Dunna Jessicaruth 2026-05-25 10:16:32 0 419
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com