Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.

0
98

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.

 

వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు రెండు భారీ కచ్చిడి చేపలు చిక్కాయి. వాటిని వెంటనే అంతర్వేది హార్బర్‌కు తరలించి వేలం వేశారు. ఇందులో 35 కిలోల బరువున్న ఒక చేప రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల ధర పలికింది. అలాగే, 30 కిలోల బరువున్న మరో చేపను వ్యాపారులు రూ.74 వేలకు కొనుగోలు చేశారు. ఈ రెండు చేపలు ఆడవి కావడంతో ఈ ధర వచ్చిందని, అదే మగ చేపలు దొరికితే ఒక్కోటి రూ.4 లక్షల వరకు పలికేదని మత్స్యకారులు తెలిపారు.

 

కచ్చిడికి ఎందుకంత ధర..?

'ప్రొటోనిబియా డయాకాంథస్' అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను 'గోల్డెన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి దాని ఔషధ గుణాలే ప్రధాన కారణం. ఈ చేప పొట్టలోని గాల్ బ్లాడర్ (స్థానికంగా 'పొట్ట' అంటారు) నుంచి శస్త్రచికిత్సల అనంతరం గాయాలకు వేసే కుట్ల దారాన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. దీంతో పాటు కొన్ని రకాల మందులు, వైన్ల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారు.

 

ఈ చేపలు హిందూ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల్లో నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. మే నుంచి అక్టోబర్ మధ్య గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. ఇక్కడి వ్యాపారులు ఈ చేపలను కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతోనే వ్యాపారులు ఎంత ధర వెచ్చించైనా కొనేందుకు ఆసక్తి చూపుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండ వద్ద బుధవారం జగన్నాథ్ అనే రైతుకు చెందిన మామిడి...
By Kothuru Murali 2026-02-04 16:10:56 0 89
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 159
Andhra Pradesh
Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్   ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన...
By Pagadala Venkateswar 2026-02-03 06:48:30 0 89
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 197
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com