కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |

0
114

 

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు.

రాబోయే రామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఒక లేఖ ద్వారా తన కుమారుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బెదిరింపుల వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉండవచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు

.స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పురోగతి లేదని, అందుకే కేంద్రం జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

భద్రతా పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, హిందూ ధర్మ రక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన హనుమంత రెడ్డిని
గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పూలమాలవేసి...
By mahaboob basha 2025-11-11 14:20:22 0 194
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు !!
కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు...
By Hari Krishna 2025-12-27 16:10:48 0 129
Andhra Pradesh
యువనేత లోకేష్ సారధ్యంలో విప్లవాత్మక సంస్కరణలు
*యువనేత లోకేష్ సారథ్యంలో విప్లవాత్మక సంస్కరణలు*   *ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా...
By Rajini Kumari 2025-12-31 10:08:51 0 141
Andhra Pradesh
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-29 13:35:10 0 136
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com