కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |

0
115

 

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు.

రాబోయే రామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఒక లేఖ ద్వారా తన కుమారుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బెదిరింపుల వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉండవచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు

.స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పురోగతి లేదని, అందుకే కేంద్రం జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

భద్రతా పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, హిందూ ధర్మ రక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
Heavy Traffic Jams towards jntu - Hitech City Road
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city...
By Terli Ashok 2026-01-30 17:45:23 0 203
Andhra Pradesh
విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
*విజయవాడ..*   పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న...
By Rajini Kumari 2025-12-29 09:40:56 0 112
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 108
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com