Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.

0
129

సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.

 

శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడ వీధుల గుండా వెళ్తూ దారిపొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి, భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన, మనవడు దేవాన్ష్ కలిసి ఫొటోలు దిగారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి...
By Sidhu Maroju 2025-12-09 12:04:32 0 289
Telangana
చెక్ పోస్ట్ లలో అవినీతి.. తెలంగాణలోని అన్ని చెక్ పోస్ట్ లు రద్దు |
హైదరాబాద్ : అవినీతి జరుగుతున్న నేపథ్యంలో.. 22 వ తేది సాయంత్రం 5గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని...
By Sidhu Maroju 2025-10-22 13:27:23 0 255
Andhra Pradesh
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు...
By Rajini Kumari 2025-12-18 11:13:09 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com