అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.
"క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న మండుల సామెల్.. అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. ఇది కేవలం పండితులపై దాడి కాదు, హిందూ సమాజంపై జరిగిన దాడి" అని వారు విమర్శించారు.
రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నియోజకవర్గంలో ఇసుక దందా, వైన్ షాపుల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డీల్స్లో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు.
హిందూ సమాజాన్ని అవమానిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz