అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!

0
205

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.

"క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న మండుల సామెల్.. అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. ఇది కేవలం పండితులపై దాడి కాదు, హిందూ సమాజంపై జరిగిన దాడి" అని వారు విమర్శించారు.

రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నియోజకవర్గంలో ఇసుక దందా, వైన్ షాపుల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు.

హిందూ సమాజాన్ని అవమానిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో కోడి పందాల స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్.
మదనపల్లి మండలం సిటిఎం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:13:13 0 134
Telangana
కోర్టులతో మొట్టికాయలు తినడమే పనిగా పెట్టుకున్న హైడ్రా
బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను...
By Ponnala Srinivasrao 2026-04-28 02:17:13 0 120
Telangana
'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు
సికింద్రాబాద్/ బేగంపేట్. బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల...
By Sidhu Maroju 2025-08-03 16:51:21 0 827
Andhra Pradesh
పాత పగతో వ్యక్తిపై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు.
అన్నమయ్య జిల్లా నారిగణిపల్లి పంచాయతీ దిగువ లంబంవారి పల్లి గ్రామంలో పాత పగల కారణంగా ఓ వ్యక్తిపై...
By Pagadala Venkateswar 2026-04-09 04:40:51 0 176
Telangana
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
By Avunoori Mahesh 2026-05-08 11:50:58 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com