అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!

0
172

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు వేద పండితులపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను బీజేపీ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ మాణిక్య రెడ్డి మరియు కె. శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.

"క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా రాజ్యాంగ ఫలాలను పొందుతున్న మండుల సామెల్.. అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. ఇది కేవలం పండితులపై దాడి కాదు, హిందూ సమాజంపై జరిగిన దాడి" అని వారు విమర్శించారు.

రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నియోజకవర్గంలో ఇసుక దందా, వైన్ షాపుల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు.

హిందూ సమాజాన్ని అవమానిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్...
By Gujile Ramu 2026-04-23 16:42:20 0 160
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?🌟ప్రశ్నించని వ్యవస్థ. కలం గళం ఎటువైపు?
మీడియా అంటే ప్రజల గొంతు,  బాధను వినిపించే వేదిక,  ప్రశ్నించే ధైర్యం. సామాన్యుడి సమస్య...
By Hazu MD. 2025-08-21 04:20:52 0 1K
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 785
Telangana
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి....సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి....సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా...
By Pinnehasan Odela 2026-01-10 14:29:26 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com