కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

0
187

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.  

‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. 

‎కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు.

‎తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.

‎మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని తెలిపారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 147
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్
కర్నూలు :  ప్రతి ఓటు విలువైనదే..• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్...
By Hari Krishna 2026-01-23 14:04:22 0 127
Telangana
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
By Sidhu Maroju 2025-09-26 08:49:23 0 232
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం...
By Pagadala Venkateswar 2026-02-10 08:58:47 0 132
Andhra Pradesh
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర...
By Ratna Sekhar 2026-02-28 18:56:45 0 466
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com