ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
97

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి చర్చించారు. 

ఈ సందర్భంగా కాలనీలలో పెరుగుతున్న దోమల సమస్యపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

పలు కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. 

ముఖ్యంగా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అదే విధంగా చీకటి ప్రాంతాల్లో ప్రజల భద్రత దృష్ట్యా కొత్త వీధి దీపాలు మరియు వాటికి అవసరమైన పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

భీమ్‌రావ్ నగర్, వాసవి నగర్ ప్రాంతాల్లో ఉన్న పార్కులను రక్షించేందుకు చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. 

దీంతో పార్కుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు ప్రజా ఆస్తి రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.

అవసరాల దృష్ట్యా కొత్త అంతర్గత రహదారులు మంజూరు చేయాలని, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ జోనల్ కమిషనర్‌కు అధికారిక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.

ఈ అంశాలపై జోనల్ కమిషనర్ సంచిత్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
బోయకొండ ఆలయ అధికారులపై ఫిర్యాదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి...
By Kothuru Murali 2026-01-11 08:03:38 0 99
Telangana
నిజామాబాద్.టీజీ ఉద్యమ కరుల సంఘం అద్యక్షుడిగా ప్రదీప్
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను...
By Sadaq Sadaq 2026-03-03 11:05:19 1 144
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 742
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com