చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి

0
181

చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల చిన్నారి సాయి దుర్గ రహదారిపై ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు ఒక ఆటో ఆమెపై నుంచి వెళ్లినట్లు సమాచారం.
పాప తల్లి పేరు పూజ, తండ్రి పేరు యాదగిరి శివకృష్ణ. భార్యాభర్తలు గత మూడు సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూజ తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లి ఇంటి వద్ద నివసిస్తూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ అనుకోని దుర్ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. చిన్నారి మృతి గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls   అమరావతి   *5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-17 09:31:55 0 212
Andhra Pradesh
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...
By Kothuru Murali 2026-04-28 06:32:05 0 107
SURAKSHA
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
By Lokeshwari Panthadi 2026-07-09 09:17:21 0 127
Legal
Delhi High Court Issues Fresh Notices to AAP Leaders in Excise Policy Case
The Delhi High Court ordered fresh notices to be issued to senior Aam Aadmi Party (AAP) leaders,...
By Dunna Jessicaruth 2026-05-19 11:35:31 0 92
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 13:04:47 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com