పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
134

అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు ఆయన త్యాగ ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు 

Search
Categories
Read More
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 237
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:41 0 136
Andhra Pradesh
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...
By John Baji 2025-12-30 01:20:59 0 136
Andhra Pradesh
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*...
By Rajini Kumari 2025-12-31 11:03:09 0 180
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com