తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న

0
220

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని భావిస్తున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 22వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక వేసింది.ఈ కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఆయనే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులు వేయనున్నారు. దీంతో తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ కానున్నాయి.

‎గత కొంతకాలంగా రైతులు ఎంతో ఆశగా ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెట్ట నుంచి నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా డబ్బుల కోసం సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థికశాఖ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలతో చర్చించారు. అనంతరం ఈ నెల 22న రైతు భరోసా నిధులు విడుదలకు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ భరోసా డబ్బులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.రైతు భరోసా డబ్బులు మొదటి విడతలో ఈనెల 22న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తారు. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు డబ్బులు వారి వారి అకౌంట్లలలో జమ కానున్నాయి. ఎకరం వరకు రూ.3,590 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత డబ్బులు పడిన 20 రోజుల తర్వాత రెండో విడత డబ్బులు జమ చేస్తారు. రెండో విడతలో రూ.2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత మూడో విడత డబ్బులు ఏప్రిల్ నెలాఖరును రైతుల ఖాతాల్లో చేరనున్నాయి. ఈ క్రమంలో మొత్తం మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

‎ 

Search
Categories
Read More
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 2K
Andhra Pradesh
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
By Mobbu Venkatramana 2026-03-02 12:59:37 0 198
Andhra Pradesh
అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్
అనకాపల్లి 5.1.2026   అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో...
By Rajini Kumari 2026-01-05 11:59:06 0 189
Andhra Pradesh
Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు   కేవలం భక్తులుగా కాకుండా ధర్మ...
By Pagadala Venkateswar 2026-02-06 14:19:38 0 148
Andhra Pradesh
సైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్
కర్నూలు :కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన...మహిళల భద్రతకు కు పటిష్ట...
By Hari Krishna 2025-12-27 16:20:40 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com