చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం

0
727

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారీగా నగదు కోల్పోయిన ఘటన చీరాలలో వెలుగుచూసింది. ఈ విషయమై చీరాల I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరాలను వెల్లడించారు. చెన్నైలోని బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనుమకొండ గోపి అనే వ్యక్తి ఈ మోసానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన స్టాక్ మార్కెట్ అడ్వైజరీ ప్రకటనలకు ఆకర్షితుడైన గోపి, అనంతరం వారి వాట్సాప్ గ్రూపులో చేరారు.

నేరగాళ్లు 'క్యాప్‌స్టోన్' అనే మొబైల్ యాప్‌ ద్వారా తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని అతడిని నమ్మించారు. తొలుత కొన్ని ఐపీఓల లో పెట్టుబడి పెట్టించి, లాభాలు వస్తున్నట్లు నకిలీ గణాంకాలను చూపించారు. దీంతో వారిని పూర్తిగా నమ్మిన గోపి, తన క్రెడిట్ కార్డులు మరియు వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సుమారు రూ.24,16,000 వరకు పెట్టుబడి పెట్టారు. అయితే, తన నగదును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, మరిన్ని ఛార్జీల పేరిట నేరగాళ్లు ఇంకా నగదు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలకు పలు సూచనలు చేశారు. అపరిచిత లింకులు సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని సీఐ సుబ్బారావు తెలిపారు.డిజిటల్ అరెస్ట్ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి సిబిఐ, ఎసిబి లేదా ముంబై పోలీసులమని చెప్పి 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని బెదిరిస్తే భయపడవద్దని అలా వచ్చిన వెంటనే సమాచారం అందించాలని సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 719
Andhra Pradesh
శ్రీకాకుళం పెకాట రాయుడాల అరెస్టు
శ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ పేటలో పేకాటరాయుల పై దాదులు చేసిన పోలీసులు నలుగురిని అడుగులోకి...
By Manda Ramkumar 2026-03-27 08:25:01 0 107
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 218
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com