జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు

0
780

పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు.

మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ

ఒంగోలు జీఆర్‌పీఎస్ పరిధిలో నమోదైన ఒక భారీ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. క్రైమ్ నెంబర్.126/2025 యు/ఎస్ 303(2) బి.ఎన్.ఎస్ కింద నమోదైన ఈ కేసులో, నిందితుడిని కేవలం 3 రోజులలోపే అరెస్ట్ చేయడమే కాకుండా, బాధితుల నుండి దొంగిలించబడిన 341 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆస్తిని వెంటనే బాధితులకు అప్పగించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.

విజయవంతమైన బృందం పర్యవేక్షణ విజయవాడ ఎస్.ఆర్.పి రాహుల్ దేవ్ సింగ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన ఈ క్రింది అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎం . మురళీధర్ డి ఎస్ ఆర్ పి నెల్లూరు, ఒంగోలు జి ఆర్ పి ఎస్.కె మౌలా షరీఫ్ సి.ఐ అఫ్ పోలీసులు

 సిహెచ్.కొండయ్య చీరాల జి ఆర్ పి ఎస్సై అఫ్ పోలీస్,

 కె. భాస్కర్ హెడ్ కానిస్టేబుల్

 బి. రాము పోలీస్ కానిస్టేబుల్,రాజు,సతీష్,లక్ష్మీ నారాయణ.

ఈ ఆపరేషన్‌లో చీరాల ఒంగోలు పోలీస్ సిబ్బంది చూపిన సమన్వయం, చురుకైన దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యలే ఈ విజయానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో మన పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె పోలీసులు అన్యాయంగా కొట్టారు – వెంకటరమణ ఆరోపణ.
మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-08 11:00:12 0 175
Andhra Pradesh
ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:07:33 0 142
Madhya Pradesh
Dhar Water Crisis: Women Brave 50-Foot Ravine
Despite ₹430 crore spent on pipeline infrastructure in Dhar district, a severe drinking water...
By Tejaswini Komanduru 2026-06-15 08:33:38 0 129
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:34:56 0 140
Telangana
నిజామాబాద్
45వ డివిజన్ లో పలు కాలనీలలో డ్రైనేజీలను రోడ్లను పర్యవేక్షించడానికి కార్పొరేటర్ శ్రీ బొబ్బిలి...
By Sadaq Sadaq 2026-05-20 08:08:38 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com