జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు

0
746

పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు.

మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ

ఒంగోలు జీఆర్‌పీఎస్ పరిధిలో నమోదైన ఒక భారీ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. క్రైమ్ నెంబర్.126/2025 యు/ఎస్ 303(2) బి.ఎన్.ఎస్ కింద నమోదైన ఈ కేసులో, నిందితుడిని కేవలం 3 రోజులలోపే అరెస్ట్ చేయడమే కాకుండా, బాధితుల నుండి దొంగిలించబడిన 341 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆస్తిని వెంటనే బాధితులకు అప్పగించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.

విజయవంతమైన బృందం పర్యవేక్షణ విజయవాడ ఎస్.ఆర్.పి రాహుల్ దేవ్ సింగ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన ఈ క్రింది అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎం . మురళీధర్ డి ఎస్ ఆర్ పి నెల్లూరు, ఒంగోలు జి ఆర్ పి ఎస్.కె మౌలా షరీఫ్ సి.ఐ అఫ్ పోలీసులు

 సిహెచ్.కొండయ్య చీరాల జి ఆర్ పి ఎస్సై అఫ్ పోలీస్,

 కె. భాస్కర్ హెడ్ కానిస్టేబుల్

 బి. రాము పోలీస్ కానిస్టేబుల్,రాజు,సతీష్,లక్ష్మీ నారాయణ.

ఈ ఆపరేషన్‌లో చీరాల ఒంగోలు పోలీస్ సిబ్బంది చూపిన సమన్వయం, చురుకైన దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యలే ఈ విజయానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో మన పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర...
By Kothuru Murali 2026-05-16 15:57:46 0 48
Telangana
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ ‎ఒక సంవత్సరం వరకు...
By Ponnala Srinivasrao 2026-05-11 07:13:52 0 60
Andhra Pradesh
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా...
By Pagadala Venkateswar 2026-03-28 04:18:43 1 172
Andhra Pradesh
వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో...
By Gadiyapudi Narendra 2026-03-05 18:05:23 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com