జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు

0
781

పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు.

మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ

ఒంగోలు జీఆర్‌పీఎస్ పరిధిలో నమోదైన ఒక భారీ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. క్రైమ్ నెంబర్.126/2025 యు/ఎస్ 303(2) బి.ఎన్.ఎస్ కింద నమోదైన ఈ కేసులో, నిందితుడిని కేవలం 3 రోజులలోపే అరెస్ట్ చేయడమే కాకుండా, బాధితుల నుండి దొంగిలించబడిన 341 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆస్తిని వెంటనే బాధితులకు అప్పగించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.

విజయవంతమైన బృందం పర్యవేక్షణ విజయవాడ ఎస్.ఆర్.పి రాహుల్ దేవ్ సింగ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన ఈ క్రింది అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎం . మురళీధర్ డి ఎస్ ఆర్ పి నెల్లూరు, ఒంగోలు జి ఆర్ పి ఎస్.కె మౌలా షరీఫ్ సి.ఐ అఫ్ పోలీసులు

 సిహెచ్.కొండయ్య చీరాల జి ఆర్ పి ఎస్సై అఫ్ పోలీస్,

 కె. భాస్కర్ హెడ్ కానిస్టేబుల్

 బి. రాము పోలీస్ కానిస్టేబుల్,రాజు,సతీష్,లక్ష్మీ నారాయణ.

ఈ ఆపరేషన్‌లో చీరాల ఒంగోలు పోలీస్ సిబ్బంది చూపిన సమన్వయం, చురుకైన దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యలే ఈ విజయానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో మన పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 95
Andhra Pradesh
జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు
*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా...
By Rajini Kumari 2026-03-14 12:16:24 0 218
Andhra Pradesh
బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో.
 బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో జరుగుతున్న ఎన్యూమరేషన్...
By Chennaiah Kati 2026-07-07 16:28:12 0 62
Andhra Pradesh
మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-31 03:41:14 0 153
Telangana
#suryapet news
 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న...
By Mahankali Ravi 2026-04-16 14:59:38 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com