Chandrababu Naidu: మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!

0
130

మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్స్

తొలి స్థానంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

నాలుగో స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా 'గణాంకాలతో కూడిన రేటింగ్స్' ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది.

 

 

 

ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపించారు. అచ్చెన్నాయుడు తర్వాత వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉత్తమ రేటింగ్స్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.

 

 

అయితే, కీలకమైన హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని, నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. మంత్రులందరూ తమ శాఖల్లో ఫైళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం సహించబోమని ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 96
Andhra Pradesh
Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.
బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం  కేంద్రానికి...
By Pagadala Venkateswar 2026-01-29 06:19:42 0 121
Andhra Pradesh
ఫైబర్ నెట్ కేసు కొట్టివేత విజయవాడ ఏ సి బి కోర్టు తీర్పు
*ఫైబర్ నెట్ కేసు కొట్టివేత...విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు*   *చంద్రబాబుకు క్లీన్ చిట్...ఇతర...
By Rajini Kumari 2025-12-13 09:09:50 0 240
Andhra Pradesh
కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-01 16:10:40 0 203
Andhra Pradesh
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె 16.12.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
By Rajini Kumari 2025-12-16 10:01:42 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com