గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

0
146

గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

 

 గోదావరిఖని ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన రేగుల వెంకటేష్ అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తేది 10-03-2026 రోజున ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి లక్ష్మీ నగర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు తన బండి నెంబర్ TS 22 5029 గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌పై వెళ్లి, కాంప్లెక్స్ వెనుక భాగంలో బండిని పార్క్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్లాడు.

 

కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా, అక్కడ పార్క్ చేసిన బండి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దొరకలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తన బండిని దొంగిలించారని రేగుల వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై మనోహర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి బైక్‌ను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మనోహర్ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి...
By Benguluri Madhubabu 2026-03-15 08:29:48 0 159
Telangana
ఒక తండ్రి దశాబ్దాల కష్టం ‎ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం
బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై...
By Ponnala Srinivasrao 2026-05-15 03:06:38 0 62
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 167
Andhra Pradesh
Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్
Scroll    విజయవాడ    వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-18 07:45:22 0 156
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com