అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|

0
146

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

2024లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.జి. నారాయణ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు క్రైమ్ నంబర్ 275/2024 కింద ఐపిసి సెక్షన్లు 376(2)(d), 376(3) మరియు పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణను చేపట్టిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ , ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు నారాయణను దోషిగా నిర్ధారించారు. 

దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు.

అలాగే, బాధితురాలికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. 

ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ లోతుగా దర్యాప్తు చేయగా, అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ప్రశాంత్ కేసు పురోగతిని పర్యవేక్షించారు. 

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ పి. ఉప చారి సాక్షుల హాజరు, కోర్టు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక హెచ్చరిక అని పోలీసు అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 154
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.
  AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు...
By Pagadala Venkateswar 2026-03-10 04:45:41 0 120
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 138
Andhra Pradesh
యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి
ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు...
By Boiena Rajesh 2026-03-23 04:22:43 0 160
Andhra Pradesh
PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
By Pagadala Venkateswar 2026-03-17 03:58:40 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com