పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం

0
1K

పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు.

మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం కలుగుతుందని తెలిపారు.

రైతులు ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలు, వ్యవసాయ సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం పొందవచ్చని వివరించారు.

ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
By Lokeshwari Panthadi 2026-07-04 08:27:36 0 65
Andhra Pradesh
ఉపాధి కల్పనపై బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదు: సీపీఎం
రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి సృష్టి అత్యంత కీలకమని సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు పేర్కొన్నారు....
By Ratna Sekhar 2026-02-19 20:05:04 0 1K
Andhra Pradesh
Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు.
మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-03-21 06:15:15 0 166
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 139
Andaman & Nikobar Islands
Great Nicobar Island Project Sparks Intense National Debate
India’s mega-development plan for the Great Nicobar Island (GNI) is taking center stage in...
By Dunna Jessicaruth 2026-05-16 05:16:56 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com