వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం

0
796

వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు.

రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా విధులు నిర్వహిస్తూ బాధితులకు సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో అధికారులు చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న ...
By Kadari Komuravelli 2026-03-23 12:04:24 0 250
Andhra Pradesh
యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలు అందించాయి
విజయవాడ నగరపాలక సంస్థ 19-01-2026        *వేమన పద్యాలు సమాజానికి నైతిక...
By Rajini Kumari 2026-01-19 11:47:25 0 146
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-01-25 12:37:03 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com