ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం

0
561

కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు.

సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ సహకరించాలని, మరణించిన గ్రాడ్యుయేట్స్ కుటుంబాలకు కమిటీ అండగా నిలవాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి విక్టర్ బాబు, ఐ. జోసెఫ్, నందిక ప్రసాద్, ఎం. లాజర్, బి.సి.హెచ్. కోటేశ్వరరావు, ఎం. రత్నం, ఎం. ఏసుపాదం, ఎం. డేవిడ్ కింగ్, కమిటీ వైస్ ప్రెసిడెంట్ కె. డేవిడ్ రాజు, వై. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సభ ఆత్మీయ వాతావరణంలో కొనసాగి, పరస్పర సహకారం మరియు సంఘ బలోపేతంపై చర్చలు జరిగాయి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 741
Andhra Pradesh
మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని...
By Pagadala Venkateswar 2026-01-25 13:19:15 0 122
Telangana
వాహనాల వేలం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో...
By Bittu Bittu 2026-01-16 13:32:34 0 401
Haryana
Senior Officials Inspect Digital Infrastructure in Haryana Government Schools
On July 17, the Haryana government deployed senior civil service officers to evaluate the use of...
By Bharat Aawaz 2025-07-17 06:38:08 0 1K
Andhra Pradesh
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు....
By Pagadala Venkateswar 2026-04-05 11:11:11 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com