మిస్సింగ్ కేసుల చేదనకు నివారణ కు వేగవంతమైన చర్యలు

0
175

*ప్రకాశం జిల్లా తేదీ:09.03.2026*

 

*మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,గారు*

 

*రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ గారు.*

 

మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి, తగిన సూచనలు, సలహాలు తెలియజేసారు.

 

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఏవరైన తప్పిపోయారని లేదా కనిపించుటలేదని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి ట్రేస్ చేయుటకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని, మిస్సింగ్‌ కేసులను మతిస్థిమితం లేని వ్యక్తులు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు కేటగిరులుగా విభజించి అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనడంలో అధునాతన విధానాలు అనుసరించాలని, మిస్సింగ్ కేసులలో ఎంత వేగంగా విచారణ మొదలుపెడితే అంత తొందరగా ట్రేస్ చెయ్యగలమని, కావున మిస్సింగ్ కేసుల్లో అలసత్వం వహించవద్దని జిల్లా ఎస్పీ గారు అన్నారు. 

 

అదేవిధంగా నాన్‌బెయిలబుల్ వారెంట్లు (NBW) ఎటువంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన అమలు చేయాలని, ముఖ్యంగా చెడు నడత కలిగిన నేరస్తులపై జారీ అయిన NBWలను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా ఎగ్జిక్యూట్ చేయాలని, సమన్స్‌లను సంబంధిత వ్యక్తులకు సకాలంలో సర్వ్ చేయాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. మహిళకు సంబంధించిన కేసులలో త్వరగా స్పందించాలన్నారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,అదే విధంగా యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీసు వారితో మరియు ఇతర సంబంధిత శాఖ అధికారులు యాక్సిడెంట్ ప్రదేశమును సందర్శించి IRAD యాప్ ద్వారా పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

 

అదే విధంగా వాటికి సంబంధించిన డేటాను కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో సక్రమంగా పొందుపరచి, కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో తాజా సమాచారం సమయానికి అప్‌డేట్ పొందుపరచాలన్నారు.

 

ఈ సమావేశంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-11 14:01:48 0 329
Telangana
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్." హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
By Sidhu Maroju 2026-06-29 08:47:51 0 56
Telangana
చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది....
By Sidhu Maroju 2026-02-02 10:44:31 0 182
Andhra Pradesh
దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:41:04 0 152
Business & Finance
PSPCL Strike Disrupts Billing and Revenue Collection
The ongoing strike by outsourced meter readers has disrupted billing operations and revenue...
By Navya Sree 2026-06-30 05:37:14 0 32
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com