Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.

0
126

 

Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

10-03-2026 Tue 12:42 | Andhra

 

Janasena Formation Day Celebrations Cancelled

ఈ నెల 14న పిఠాపురంలో జరగాల్సిన వేడుకల రద్దు

ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం

జిల్లా, నగర, మండల కేంద్రాల్లో స్థానికంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న పవన్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రణాళికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో భారీ ఎత్తున వేడుకలను నిర్వహించాలని జనసేన తొలుత నిర్ణయించింది. అయితే, ఆ వేడుకలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితులపై అందిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని జనసైనికుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 

 

 

తొలుత పిఠాపురం వేదికగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణం దృష్ట్యా వ్యూహం మార్చారు. రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభకు బదులుగా, ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా, నగర, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ స్థానికంగానే ఘనంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. మార్చి 14 అనేది జనసైనికులకు, వీర మహిళలకు ఒక పండగలాంటి రోజని, ఆ ఉత్సాహం తగ్గకుండా స్థానిక స్థాయిలోనే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

 

 

పిఠాపురంలో భారీ సభ రద్దు కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన కార్యాలయాలు పండుగ వాతావరణానికి సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..
బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ స్మారక విజ్ఞాన...
By Gadiyapudi Narendra 2026-03-15 13:46:38 0 248
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 136
Andhra Pradesh
గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.
Kvsr. Koteswararao. Guntur   *గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది:...
By KOTESWARARAO KVSR 2026-01-09 16:13:14 0 436
Sikkim
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...
By Dunna Jessicaruth 2026-05-16 04:46:11 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com