నాగులపాలెం వద్ద స్కూల్ రహదారి మూసివేతపై ఆందోళన – సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్

0
228

బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి–167 పనుల నేపథ్యంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లే రహదారిని మూసివేయడం సరైన చర్య కాదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
నాగులపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు రోజువారీ రాకపోకలకు ఈ రహదారిని వినియోగిస్తున్నారు. అయితే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదా డైవర్షన్ ఏర్పాటు చేయకుండా రహదారిని మూసివేయడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.
అధికారులు తక్షణమే స్పందించి నాగులపాలెం వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి ఆ రహదారిని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుతో కలిపి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి పరిష్కారం చూపాలని, అలాగే పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు
*తాడేపల్లి*   *మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని...
By Rajini Kumari 2026-01-28 13:07:52 0 159
Telangana
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో...
By Pinnehasan Odela 2026-05-01 13:57:06 0 115
Telangana
అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులకు పిలుపునిచ్చారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో...
By Gangaram Rangagowni 2026-02-17 09:59:25 0 344
Telangana
జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు...
By Avunoori Mahesh 2026-05-13 10:27:15 0 112
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-21 01:30:57 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com