అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
185

*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*అంగన్వాడి కార్యకర్తలతో....ముఖాముఖిగా సమావేశమైన ఎమ్మెల్యే*

 

*తమ సమస్యలను ఎమ్మెల్యే రాముకు వివరించిన... అంగన్వాడి కార్యకర్తలు*

 

*అంగన్వాడీ సోదరీమణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే రాము*

 

*అంగన్వాడి సోదరీమణులకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం:ఎమ్మెల్యే రాము*

 

*గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో... వేతనాల పెంపు సమస్య కొంత ఆలస్యం:ఎమ్మెల్యే రాము*

 

*సీఎం చంద్రబాబు హయాంలోనే... అంగన్వాడీల జీతాలు పెరిగాయి: ఎమ్మెల్యే*

 

*తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన....అంగన్వాడి కార్యకర్తలు*

 

గుడివాడ మార్చ్ 09: రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 

 

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా.... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యం అయ్యిందని... ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు. 

 

పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు.

 

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడి సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే , అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు.

అంగన్వాడి సోదరీమణుల కష్టం గుర్తించిన ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే రాము ఉద్ధాటించారు.

 

 

ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
🛑 The Shadow of Statelessness: Illegal Deportations & Citizenship Rights in India
In a country built on the values of democracy, dignity, and constitutional...
By Citizen Rights Council 2025-07-07 11:47:16 0 2K
Telangana
నిజామాబాద్: గత నెలాలో ముతపడ మినీ ట్యాంక్ బoడ్
గత నెల రోజులుగా మూతపడ్డ మినీ ట్యాంక్ బండ్‌... మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ...
By Sadaq Sadaq 2026-06-01 15:40:33 0 100
Telangana
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
By Sidhu Maroju 2026-01-28 15:20:09 0 188
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-13 09:46:53 0 100
Andhra Pradesh
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*     *కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...
By Rajini Kumari 2026-01-10 13:30:52 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com