ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|

0
102

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 

మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేంజ్-2 అధికారులు పథకం ప్రకారం ఎల్బీనగర్ చౌరస్తాలో మాటు వేశారు.

లంచం డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 143
Andhra Pradesh
మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-09 05:32:42 0 78
Andhra Pradesh
ఏపీ ఎస్పీడీసీఎల్
మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-22 07:14:48 0 100
Andhra Pradesh
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే...
By Rajini Kumari 2026-02-02 17:18:07 0 124
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com