ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|

0
171

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 

మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేంజ్-2 అధికారులు పథకం ప్రకారం ఎల్బీనగర్ చౌరస్తాలో మాటు వేశారు.

లంచం డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
By Kiran Kumar 2026-04-14 21:45:34 0 294
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 80
Andhra Pradesh
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ
మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున...
By Boiena Rajesh 2026-02-26 15:29:36 0 197
Telangana
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా   రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
By Vanmoj Suryamohan 2026-01-10 14:37:48 0 861
Andhra Pradesh
జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-27 04:16:37 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com