Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

0
73

Andhra

 

CM Chandrababu Naidu Tours Nandyala District Today

డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం

కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు

స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

ఇవాళ‌ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Telangana
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
By Sidhu Maroju 2025-10-23 14:22:13 0 226
Telangana
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వం
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ...
By Kadari Komuravelli 2026-03-26 16:00:21 0 114
Andhra Pradesh
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :  ఐవోసీఎల్‌లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
By Hari Krishna 2025-12-24 14:32:32 0 189
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com